యోబు తన ఆస్తులను, తన ఆరోగ్యాన్ని, తన పిల్లలను అన్నింటినీ పోగొట్టుకోని ఎంతో క్రుంగిపోయిన స్థితిలో ఉన్నాడు.
అసలే క్రుంగిన స్థితిలో ఉన్న యోబు యొద్దకు తన స్నేహితులు వచ్చి ఇంకా క్రుంగదీశారు (యోబు 42:7-9).
పౌలు తన విశ్వాసం వలన చేరశాలలో వేయబడి శ్రమ అనుభవిస్తున్నాడు.
అదే సమయంలో కొందరు క్రైస్తవ బోధకులు పౌలును ఇంకా క్రుంగదీశారు (ఫిలిప్పీ 1:14-18).
నువ్వు కూడా ఎప్పుడైనా క్రుంగిపోయిన స్థితిలో దుఃఖంతో కఠినమైన పరిస్థితిగుండా వెళ్తున్నప్పుడు ఎవరైనా వచ్చి నిన్నింకా క్రుంగదీసారా?
~ యోబు స్నేహితులులానే కొందరు వచ్చి వారి తప్పుడు సిద్ధాంతాలతో లేక ఏ కారణం లేకుండానే నిన్ను నిందిస్తూ నిన్ను వారి పెద్ద పాదాలతో తొక్కేసే వారిగా ఉంటున్నారేమో.
~ లేక పౌలు సహాపనివారిలాగా ఈర్ష్య, పగతో, నిన్ను బాధపెట్టడంలో ఆనందం పొందే వారిగా, నీ బాధను ఇంకా అధికం చేసే ఆ పెద్ద పాదాలతో నిన్ను తొక్కేసే వారిగా కూడా ఉంటున్నారేమో.
కొంచెమైనా అర్ధంచేసుకుంటారేమో అని అనుకున్నప్పుడు, తీర్పు తీర్చడం లేక ఈర్ష్య ద్వేషంతో వారు నిన్ను ఇంకా క్రుంగదీయడంలాంటివి చేసినప్పుడు అది నీ హృదయాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి?
1. మనిషులను కాదు దేవుణ్ణి ఆశ్రయించు, అలానే నీది కాని ఆ నిందను అంగీకరించి సొంతం చేసుకోకుండా నిరాకరించు (యోబు 27:5).
2. నీ బాధ మీద నుండి దృష్టిని మళ్ళించి దేవుని ఉద్దేశాలను వెతకడం ప్రారంభించు (ఫిలిప్పీ 1:18,19).
3. దేవుని ఆదరణను వెతకటం నేర్చుకో. ఇతరులు నిన్ను ఇంకా క్రుంగదీసినా, నిన్ను విడువను అన్న దేవుని వాగ్దానాన్ని పట్టుకో (2 కొరింధీ 1:3-5).
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.