ఈ భూమిపై న్యాయం పొందటం మన హక్కు అని ఎంత వాదించినా, దేవుని వాక్యం దానిని మనకి వాగ్దానంగా ఇవ్వలేదు (2 థెస్సలొనిక 1:6,7).
కాని మనం ఆత్మీయంగా వర్ధిల్లాలంటే, మనకి న్యాయం జరగాల్సిన అవసరమేమి లేదు.
కొన్నిసార్లు మనకు అన్యాయం జరగడం వలన అది మనలో గొప్ప ఎదుగుదలకు, సేవ బలపడటానికి దారితీస్తుంది. దానికి మంచి ఉదాహరణ యోసేపు.
• కుటుంబం నుండి హింసింపబడ్డాడు - తన పై అసూయ ఉన్న తన అన్నలు తన ఏడుపును కూడా పట్టించుకోలేదు (ఆదికాండము 42:21).
• తనను భందించినవారి నుండి హింసింపబడ్డాడు - గొలుసులతో కట్టివేయబడటం, చెరసాలలో వేయబడటం, ఒంటరితనం (కీర్తన 105:17,18).
• పొతీఫరు భార్య ప్రతీకారంతో చెప్పిన అబద్దపు సాక్ష్యం వలన - సరైన పని చేసినందుకు చెరశాలలో వేయబడటం (ఆదికాండము 39).
~ నువ్వు కూడా నీ సన్నిహితుల వల్ల తీవ్రంగా గాయపరచబడ్డావా?
~ నువ్వు కూడా దుర్వినియోగించబడ్డావా, మోసగించబడ్డావా, హింసింపబడ్డావా?
~ నువ్వు కూడా సరైన పని చేసినందుకు అపనిందలపాలయ్యవా?
బహుశా యోసేపుకు లోతైన మానసిక, శారీరిక గాయాలు ఉండి ఉండవచ్చు (ఆదికాండము 43:30), కాని తాను వాటిని ఓడించాడు.
చెరశాలలో అతను వర్ధిల్లాడు :
1. దేవునికి ఒక ప్రణాళిక ఉందని నమ్మాడు (ఆదికాండము 50:20).
2. దేవుడు, ఇతరులు తనకు వ్యతిరేకంగా చేసిన పాపాలను కూడా తన మేలుకై వాడగలరని నమ్మాడు (ఆదికాండము 50:20).
3. దేవుడు, తన ప్రయత్నాలను ఆశీర్వదిస్తారు అని నమ్మి అన్ని సందర్భాలలో ఉన్నతంగా జీవించాడు (ఆదికాండము 39:2-6, 20-23, 41:41-44).
ఈరోజుల్లో ఉన్న సంస్కృతి, ఆధునిక సలహాదారులు, 'నువ్వు బాధితుడివి' అనే మనస్తత్వం చుట్టూ నీ జీవితాన్ని కట్టుకోమని ప్రోత్సాహిస్తుంటారు.
కయీనులాగ ఉండు అని మన సంస్కృతి మనల్ని ప్రోత్సాహిస్తుంది. కాని కయీనుకున్న ఈ బాధితుడిని అనే మనస్తత్వాన్ని జయించి, యోసేపులాగా ఉండటాన్ని ఎంచుకుందామా!













