ఒక అద్భుతమైన, విశాలమైన ఇంటికి మారే ముందు, ఒక అసౌకర్యవంతమైన గుడారంలో నువ్వు నీ కుటుంబం కొన్ని నెలలు నివసించాలనుకో.. ఊహించు..
అసౌకర్యాలు గురించి ఫిర్యాదు చేయాలని అనిపించినప్పుడెల్లా, రాబోయేది గుర్తుచేసుకుంటావు కదా. ఇంక కొత్తింటికి మారిన తరువాత అనుభవించిన ఆ కొద్ది నెలల అసౌకర్యం అసలు గుర్తే రాదు కదా.
మనం ఎప్పుడైతే నిరాశలు, కఠిన పరిస్థితులు, దుఃఖం, మరణాలు, అనారోగ్యం వంటివి అనుభవిస్తామో, ఈ పై విధంగా సంభాళించుకోవడం బైబిల్ చెప్పే పద్ధతి.
మనం క్రీస్తు ప్రభువును మన రక్షకునిగా చేసుకుంటే, సమస్యల మధ్యలో నుండి, పరలోకంలో మనం ఉండబోయే ఆ నిత్యత్వంతో పోల్చుకుంటే, భూమిపై మనం జీవించే జీవితం చాలా స్వల్పమైనదే అని మనకు మనమే గుర్తు చేసుకోవాలి.
అలాగని నొప్పి, బాధ, భయం, నిరాశ మనం నివసించే ఈ 'గుడారపు జీవితానికి' ఉండవని కాదు. కాని ఎప్పుడైతే భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవునిపై మనం నిరీక్షణ కలిగి ఉంటామో, నిత్యత్వమే లోపం లేనిదని మనకి మనం గుర్తుచేసుకుంటామో, అప్పుడే మన ఆత్మకి నెమ్మది కలుగుతుంది.. :
భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. (2 కొరింథీయులకు 5:1)
ఆ సమయం వచ్చే వరకు దేవుని వద్దే విశ్రాంతి వెదకాలి:
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. (మత్తయి 11:28-30)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.