మానవునిగా ఉండటం ఒకప్పుడు మంచిదే. దేవుని స్వరూపంలో చేయబడ్డాం గనుక మన సృష్టికర్తను సంపూర్ణంగా ప్రతిబింబించాము.
కాని ఆదాము అవ్వలు దానిని పూర్తిగా మార్చేశారు.
ఆదాము స్వరూపంలో జన్మించేలా, మన సృష్టికర్తను అసంపూర్ణంగా ప్రతిబింబించేలా, పాపం మనలను నాశనం చేసింది (ఆదికాండము 5:1-3).
"నేను కేవలం మనిషిని" అనే మాట మనకొక సాకుగా మారిపోయింది.
అప్పుడే యేసు మానవుడయ్యాడు.
సమస్తాన్ని పూర్తిగా మార్చేశాడు.
"నేను కేవలం మనిషిని" అనే సాకు నిలిచిపోయి, ఒక నిర్ణయంగా మారిపోయింది.
మనలో ఇంకా మానవ పాప స్వభావం ఉంటుంది, కాని మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మన ప్రాచీనస్వభావమును "వదలుకొని" మన చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును "ధరించుకొనవలెను". (ఎఫెసీయులకు 4:22-24)
"నేను కేవలం మనిషిని", కాని అలా జీవించనవసరం లేదు.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.