ఈ అపోహ అందరిలో ఉండడం ఈరోజుల్లో సాధారణమైపోయింది.
కాని మనం ఒకటి అర్ధం చేసుకోవాలి : "మనం విలువైనవారమని దేవుడు మనలను ప్రేమించడంలేదు. కాని దేవుని ప్రేమే మనకు విలువనిస్తుంది అని" ఫుల్టన్ జాన్ షీన్.
"గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు... "(రోమీయులకు 3:11)
"అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి...." (రోమీయులకు 3:12)
"ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు." (రోమీయులకు 3:23,24)
"కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయబడెను... (రోమీయులకు 3:27)
"యేసు క్రీస్తు యొక్క సిలువ త్యాగానికి మనం ఏ రకంగానూ యోగ్యులం కాము" అనే విషయం గుర్తుపెట్టుకోవడం చాలా కీలకమైనది.
దేవుని యొక్క ఉన్నతమైన కృపకు మనం ఎంత అనర్హులమో, ఆ కృప ఎంత అద్భుతమైనదో, ఎంత మధురమైనదో, ఎంత ఆశ్చర్యకరమైనదో, ఎంత సహసవంతమైనదో మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికీ తీరనిది.
ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. (ప్రకటన 4:11).
-------------
రోమీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని 11 నుండి 27 వచనముల వరకు దయచేసి చదివి ధ్యానించమని నా మనవి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.