నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?

కీర్తన 8 లో దావీదు ఒక అద్భుతమైన అతిముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. వాస్తవానికి మనమందరం ఈ ప్రశ్నను అడగాలి కాని, చాలా తక్కువ మందే అడుగుతారు.


దేవుడు ఎప్పుడూ అందుబాటులోనే ఉండేవాడు, ఎప్పుడూ ఆలకించేవాడు, క్షమించడానికి సిద్దమనస్సు కలవాడు గనుకనే ఆయన ప్రేమను మనం సులభంగా తీసుకుంటాం.


కాని మన నిజాయితీని పరీక్షించుకోవడానికి కీర్తన 8:4 మనకు చాలా ఉపయోగపడుతుంది.


దావీదు దేవుణ్ణి అడుగుతాడు "నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?" అని


ఆకాశములో ఉన్న మహిమకు దావీదు ఆశ్చర్యపోతూ, అంతటి అద్భుతమైన దేవుడు ఎందుకని మనిషికి ఇంత మహిమను, ప్రభావమును, విలువను ఇచ్చాడు అని.


దేవుడు ఏ లోపము లేని లోకాన్ని సృష్టించలేదా? మనిషి దాన్ని పాడుచేయలేదా?


మనిషి యుగాలు సంవత్సరాలు తరబడి దేవుని ప్రేమను వెక్కిరిస్తూ, ఆయన్ని నిరాకరించడంలేదా?


అయినప్పటికీ ఇంత ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ పాపపు మానువులను ఎందుకు ప్రేమిస్తూనే ఉన్నాడు?


దావీదు ప్రశ్న సరైనదే!


చాలా మంది దేవుని ఎదుట తమ పిడికిళ్లు బిగించి, ఎందుకు మాకు ఎక్కువ చేయలేదని ప్రశ్నిస్తూ ఉంటే...


దావీదు మాత్రం అద్భుతంగా ఈ సూర్యచంద్రులను నక్షత్రాలను చేసిన ఆ గొప్ప సృష్టికర్త మనిషిని ప్రేమించడమేంటి అని విస్మయంతో నిండిపోయాడు.


ఇదే మనం కూడా తిరిగి చెప్పాలి : దావీదు ప్రతిస్పందన సరైనది.


కనుక అంత గొప్ప దేవుడు మనలను ప్రేమిస్తున్నారనే సత్యాన్ని లోతుగా ఆలోచించడానికి ఈరోజు కొంత సమయం తీసుకుందాం!


What Is Man that You are Mindful of Him?


కీర్తన 8 లో దావీదు ఒక అద్భుతమైన అతిముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. వాస్తవానికి మనమందరం ఈ ప్రశ్నను అడగాలి కాని, చాలా తక్కువ మందే అడుగుతారు.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.