~ యేసు మాట్లాడినప్పుడు, ఆయన కేవలం సత్యాన్ని ప్రకటించడం మాత్రమే కాదు గాని ఆయనే సత్యానికి కర్త అయి ఉన్నాడు.
~ ఇంకా చెప్పాలంటే, ఆయన సత్యానికి కర్త మాత్రమే కాదు, ఆయనే సత్యం.
~ ఆయన సత్యాన్ని ప్రకటించే గొప్ప వర్తమానికుడు మాత్రమే కాదు గాని, ఆయనే ఆ గొప్ప వార్త.
ఆది నుండి క్రీస్తే దేవుని వాక్కయి ఉన్నాడు:
❤ ప్రవక్తల గుసగుసల్లో
❤ లోకంలో ఆయన చేసిన పరిచర్య ప్రకటనల్లో
❤ సిలువపై బాధతో, క్షమాపణతో కూడిన ఆయన దీనమైన దుఃఖంలో
❤ పునరుద్దానం యొక్క మధురమైన సంగీతంలో
• దేవుని వార్త ఇప్పటికీ ఇంకా గుసగుసలాడుతుంది, ప్రకటిస్తుంది, దీనంగా దుఖిస్తుంది, ప్రతీ ఆత్మకు పాడుతుంది. వీటన్నిటిని విని, నమ్మిన మనం కూడా ఆయన వార్తను, ప్రకటించాలి, దుఃఖించాలి, ఆయన వార్తను ప్రతీ ఒక్కరికి పాడాలి.
ఈరోజు నేను పాడుతున్నాను. నాతో మీరు కూడా కలుస్తారా?
పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. (హెబ్రీయులకు 1:1,2)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.